నవతెలంగాణ-హైదరాబాద్: అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో 265 మంది ప్రాణాలు కోల్పోగా.. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతుండగా బ్రిటన్కు చెందిన ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ (AAIB) బృందాన్ని పంపుతున్నట్లు బ్రిటన్ ప్రధాని స్టార్మర్ ప్రకటించారు. విమానం ప్రమాదానికి గల కారణాలపై పూర్తి స్పష్టత వచ్చే వరకు భారత అధికారులతో కలిసి పనిచేస్తామని ఆయన చెప్పారు.బ్రిటన్ విదేశాంగ శాఖా కార్యదర్శి డేవిడ్ లామీ ఈ దర్యాప్తుకు నాయకత్వం వహిస్తారని, ప్రమాదంలో ప్రభావితమైన వారి కుటుంబాలు అవసరమైన సమాచారం కోసం విదేశాంగ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన సూచించారు.
అయితే విమాన ప్రమాద సమయంలో మొత్తం సిబ్బందితో కలుపుకొని 242మంది ఉన్నారు. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, ఒక కెనడియన్, ఏడుగురు పోర్చుగీస్ పౌరులు, 12 మంది సిబ్బంది ఉన్నారు.