– డ్రగ్ కంట్రోల్ అథారిటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నకిలీ మందులు లేని రాష్ట్రంగా తెలంగాణను మార్చే క్రమంలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. తాజాగా విశ్వసనీయ సమాచారం మేరకు హైదరాబాద్లోని కోఠి ఇందర్బాగ్లో గల మార్కెట్లో నకిలీ మందులను పట్టుకున్నారు. రొసువాస్ ఎప్ 20, రొసువాస్ ఎప్ 10 టాబ్లెట్లకు చెందిన నకిలీ మందుల (కౌంటర్ ఫిట్ వర్శన్)కు సంబంధించి రూ.3 లక్షల విలువైన వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మందులు తక్కువ కొలెస్ట్రాల్, రక్తంలో ట్రైగ్లైసెరైడ్ స్థాయిలు, గుండె సంబంధిత సమస్యలున్న వారు ఉపయోగించేవి. దాడుల సందర్భంగా గంగా ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్, నందినీ ఫార్మాలో సదరు అనుమానిత మందులను గుర్తించారు. వాటిపై ఉన్న బ్యాచ్ నెంబర్లు తమవి కావనీ ఆ మందుల తయారీదారు సన్ ఫార్మాస్యూటికల్ ఇండిస్టీస్ లిమిటెడ్ ద్వారా నిర్థారించారు. సిక్కిం రాష్ట్రానికి చెందిన సన్ ఫార్మాస్యూటికల్ ఇండిస్టీస్ లిమిటెడ్ వీటిని తయారు చేస్తున్నారు. విచారణ కొనసాగు తున్నది. చట్టాన్ని ఉల్లంఘించిన వారందరిపై చర్యలు తీసుకో నున్నట్టు అధికారులు తెలిపారు.
అత్యంత ప్రమాదకరం
నకిలీ మందులు అత్యంత ప్రమాదకరమని డ్రగ్ కంట్రోల్ అధికారులు హెచ్చరించారు. ఇవి రోగాలను నయం చేయకపోగా, ప్రజారోగ్యాన్ని మరింత దెబ్బతీస్తాయని తెలిపారు. అనుమానిత మందులను ప్రజలు గుర్తిస్తే వాటిపై వెంటనే డ్రగ్ కంట్రోల్ అథారిటీ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలని వారు సూచించారు.
నకిలీ మందుల పట్టివేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES