– తమిళ సంస్కృతిపై దాడి: ఎంకె స్టాలిన్ విమర్శ
చెన్నై: తమిళనాడులోని కిలాది నాగరికత ప్రదేశం వద్ద జరిగిన తవ్వకాల నివేదికను కేంద్ర ప్రభుత్వం బహిరంగ పర్చకపోవడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిని తమిళ సంస్కృతిపై దాడిగా అభివర్ణించారు. ఈ మేరకు డీఎంకే పార్టీ కేడర్కు స్టాలిన్ లేఖరాసారు. మోడీ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా మధురైలో డీఎంకే విద్యార్థి విభాగం నిర్వహించిన ప్రదర్శన రాష్ట్రవ్యాప్తంగా ప్రతిధ్వనించిందని లేఖలో ముఖ్యమంత్రి తెలిపారు. తమిళ నాగరికత గొప్పతనాన్ని, ప్రాచీనతను ఢిల్లీ గుర్తించే వరకూ డీఎంకే విశ్రమించదని స్టాలిన్ స్పష్టం చేశారు. కిలాది పరిశోధనలను రక్షించుకోకపోతే హరప్పా వంటి నాగరికత ఆవిష్కరణను కూడా అణచివేసే ప్రమాదం ఉందని మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి చేసిన హెచ్చరికలను స్టాలిన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘మన నాయకుడు హెచ్చరించినట్లుగానే తమిళులను, తమిళ భాషను నిరంతరం శత్రుత్వం చేసే బీజేపీ ప్రభుత్వం కిలాది వద్ద పరిశోధనల్లో కనుగొన్న వాటిని అణచివేసి పూడ్చిపెట్టడానికి ప్రయత్నిస్తోంది’ అని స్టాలిన్ తన లేఖలో తెలిపారు. అలాగే, ఈ అంశంపై బీజేపీ మిత్రపక్షమైన ఎఐఎడిఎంకె ”మౌనంగా ఉండటం”పై స్టాలిన్ విమర్శించారు. ”ఎఐఎడిఎంకెను బీజేపీకి తాకట్టు పెట్టిన పళనిస్వామి నుంచి మనం ఏమి ఆశించగలం?” అని స్టాలిన్ ప్రశ్నించారు. రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా ‘పార్టీ హైకమాండ్ను ప్రసన్నం చేసుకోవడానికి తమిళ భాష, సంస్కృతిపై తమ ప్రేమను వదులుకున్నారని విమర్శించారు. కిలాది వద్ద తవ్వకాలలో కనుగొన్న వస్తువులతో ఒక మ్యూజియం ఏర్పాటుతో సహా తమిళ భాష, సంస్కృతిని పరిరక్షించడానికి డీఎంకే ప్రభుత్వం కృషి చేస్తోందని స్టాలిన్ తెలిపారు. తమిళ నాగరికత యొక్క ప్రాచీనతను యువతరం అర్థం చేసుకోవడానికి ఈ మ్యూజియం సహాయపడుతుందని అన్నారు.శివగంగ జిల్లాలోని కిలాది నాగరికతపై భారత పురావస్తు సర్వే అధ్వరంలో 2014లో తవ్వకాలు, పరిశోధనలు ప్రారంభమయ్యాయి. రెండేండ్ల క్రితం అధికారులు నివేదికను సమర్పించారు. అయినా కేంద్రం ఇప్పటి వరకూ ఈ నివేదికను బహిరంగపర్చలేదు.
కిలాది నివేదికపై కేంద్రం వైఖరి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES