- Advertisement -
నవతెలంగాణ -హైదరాబాద్ : హనుమకొండ, వరంగల్ జిల్లా న్యాయస్థానాలకు బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తి న్యాయస్థానాల్లో బాంబు పెట్టామంటూ బెదిరింపు కాల్ చేశారు. వెంటనే కోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్ సాయంతో తనిఖీలు చేస్తున్నారు. బాంబు బెదిరింపు కాల్ రావడం ఇది మూడోసారి కావడం గమనార్హం.
- Advertisement -