Friday, June 20, 2025
E-PAPER
Homeతాజా వార్తలురిజర్వేషన్లపై పరిమితిని తొలగించాలి: జైరాం రమేష్

రిజర్వేషన్లపై పరిమితిని తొలగించాలి: జైరాం రమేష్

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: రిజర్వేషన్లపై 50శాతం పరిమితిని తొలగించాలని, ఈ అంశాన్ని పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తాము కచ్చితంగా లేవనెత్తుతామని కాంగ్రెస్ కమ్యూనికేషన్ ప్రతినిధి జైరాం రమేష్ శుక్రవారం పేర్కొన్నారు. బీహార్‌ రిజర్వేషన్ల చట్టాన్ని రాజ్యాంగంలో తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చాలని, రిజర్వేషన్లకు 50శాతం పరిమితిని అధిగమించడానికి రాజ్యాంగాన్ని సవరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిలు మరియు ఇబిసిలకు రిజర్వేషన్లను అనుమతించే ఆర్టికల్‌ 15(5)ను అమలు చేయాలని పునరుద్ఘాటించారు.

సామాజిక న్యాయం, సాధికారత మరియు ప్రాథమిక ప్రాముఖ్యత కలిగిన ఈ మూడు అంశాలను రాబోయే పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో పార్టీ కచ్చితంగా చర్చకు తీసుకువస్తుందని అన్నారు. గత ఇండియా బ్లాక్‌ ప్రభుత్వం నిర్వహించిన కులసర్వే ఆదారంగా రాష్ట్రంలో ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి మరియు ఇబిసిలకు 65శాతం రిజర్వేషన్లు ప్రతిపాదించిందని, కానీ బీహార్‌లోని డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం వాటిని పక్కన పెట్టిందని మండిపడ్డారు. బీహార్‌ రిజర్వేషన్ల చట్టాన్ని రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్‌లో భాగంగా చేయాలని పిలుపునిచ్చారు. తమిళనాడులో 69శాతం రిజర్వేషన్లను కాపాడటానికి 1994లో పి.వి.నరసింహారావు ప్రభుత్వం తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చిందని గుర్తు చేశారు. 50శాతం రిజర్వేషన్లను అధిగమించడానికి రాజ్యాంగాన్ని సవరించాలని కూడా పిలుపునిచ్చారు. గత ఆరు దశాబ్దాలుగా సుప్రీంకోర్టు ఇచ్చిన వివిధ తీర్పుల కారణంగా ఈ సీలింగ్‌ విధించబడిందని అన్నారు. ఆర్టికల్‌ 15(5) ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో కూడా రిజర్వేషన్లను అనుమతిస్తుందని అన్నారు. 2006లో డా.మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణను సుప్రీంకోర్టు సమర్ధించిన తర్వాత గత 11 ఏళ్లుగా ఇది అమలు కాలేదని మండిపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -