Saturday, June 21, 2025
E-PAPER
Homeజాతీయంచిన్నారుల పాట‌కు రాష్ట్రప‌తి భావోద్వేగం

చిన్నారుల పాట‌కు రాష్ట్రప‌తి భావోద్వేగం

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: మూడు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము ఉత్త‌రాఖండ్‌లో వెళ్లారు. ఓ డెహ్రాడూన్‌లోని ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రుగా.. జాతీయ దృష్టి దివ్యాంగజన సాధికారత సంస్థ విద్యార్థులతో కొంత సమయం గడిపారు. దివ్యాంగ విద్యార్థులతో సంభాషించారు. ఆ త‌ర్వాత రాష్ట్రప‌తి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా దివ్యాంగ పాఠశాలలోని అంధ విద్యార్థులు ఆమె కోసం ఓ ప్రసిద్ధ బాలీవుడ్ పాటను పాడుతున్నారు. ఈ పాట విన్న రాష్ట్రపతి చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఆమె కళ్ళలో నీళ్లు ఆగలేదు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ధామి, గవర్నర్ గుర్మీత్ సింగ్ కూడా పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. “నా ప్రజా జీవితంలో అత్యంత హత్తుకునే క్షణాల్లో ఇది ఒకటి. కల్మషం లేని చిన్నారుల స్వరం, వారి బలం, స్ఫూర్తి భారతదేశ నిజమైన ఆత్మను ప్రతిబింబిస్తుంది.” అని ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -