Sunday, June 22, 2025
E-PAPER
Homeకరీంనగర్మా ఊరికి ప్రయివేటు స్కూల్‌ బస్సులు రావొద్దు

మా ఊరికి ప్రయివేటు స్కూల్‌ బస్సులు రావొద్దు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లా కాల్వ­శ్రీరాంపూర్‌ మండలం ఊశన్నపల్లిలో శుక్రవారం ప్రయివేటు స్కూళ్ల బస్సులను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఉదయం స్కూల్‌ బస్సులు వచ్చే సమయానికి గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద గుమికూడిన కొంద­రు గ్రామస్తులు.. బస్సులు ఎక్కుతున్న పిల్లలను దించివేశారు. దీంతో గ్రామస్తులంతా అక్కడికి చేరుకున్నారు. పాఠశాల హెచ్‌ఎం ఈర్ల సమ్మయ్య ఈ వి­ష­యాన్ని ఎంఈఓ మహేశ్‌కు తెలపటంతో హుటా­హుటిన ఘటనా స్థలానికి చేరుకుని ప్రైవేటు స్కూళ్ల­కు వెళ్తున్న పిల్లల తల్లిదండ్రులతో ఆయన మాట్లాడా­రు. పిల్లలను ప్రభుత్వ బడికి పంపించాలని కోరారు. అనుమతులు లేకుండా పిల్లలను తరలిస్తున్న వ్యాన్ల డ్రైవర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊశన్నపల్లి పాఠ­శా­ల ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తూ, విద్యార్థులను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని, కలెక్టర్‌ చేతుల మీదుగా ‘బెస్ట్‌ స్కూల్‌’‘ఛాంపియన్‌ స్కూల్‌’అవార్డులు పొందారని ఎంఈఓ గుర్తు చేశా­రు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -