అటవీ భూమి ఆక్రమణకు ప్రయత్నించిన వ్యక్తులపై కేసు నమోదు
ట్రాక్టర్ సీజ్, దాడి చేసిన వారిపై చర్యలు
నవతెలంగాణ – డిచ్ పల్లి : అటవీ భూమిని కొందరు అక్రమార్కులు రాత్రి సమయంలో పెట్టి చదును చేస్తున్నారని విశ్వసనీయంగా సమాచారం ఫారెస్ట్ అధికారులు అందుకున్నారు. ఈ నేపథ్యంలో రాత్రిపూట ఘటన స్థలానికి చేరుకొని ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు. తిరిగి వెళ్లేటప్పుడు కారంపొడితో దాడి చేసిన ఘటన శనివారం రాత్రి 11:00 గంటల ప్రాంతంలో ఇందల్ వాయి అటవీ రేంజ్ పరిధిలోని ధర్పల్లి మండలంలోని కోటాల్ పల్లి సెక్షన్ పరిధిలోని కొటాల్ పల్లి బీట్ లోని రామరెడ్డి రిజర్వ్ అటవీ ప్రాంతంలోని కంపార్ట్ మెంట్ నెంబర్ -593 లో చోటు చేసుకుంది.ఇందల్ వాయి ఫారెస్ట్ రేంజ్ అధికారి రవి మోహన్ భట్ తెలిపిన వివరాల ప్రకారం.. కోటాల్ పల్లి సెక్షన్ పరిధిలోని కొటాల్ పల్లి బీట్ లోని రామరెడ్డి రిజర్వ్ అడవిలో అటవీ భూమిని చదును చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు సెక్షన్ అధికారి భాస్కర్ ఆధ్వర్యంలో బిట్ అధికారులు ప్రవీణ్, ఉదయ్, ఖదీర్, బేస్ క్యాంప్ & స్ట్రయికింగ్ ఫోర్స్ వచర్లు వంశీ, హరిష్, డ్రైవర్ మొయిన్ వెళ్ళి అటవీ భూమిని చదును చేస్తున్న ట్రాక్టర్ నెంబర్ TS 16 UC 7054 ను పట్టుకోవడానికి ప్రయత్నించగా కోటాల్ పల్లి తండాకు చెందిన భుక్య నవీన్, పూల్ సింగ్, మధు, సంగ్యా, లచ్చ్య, కవిత, వంశీ, మేరి మరియు ఇతర తండా వాసులు అటవీ అధికారులను అడ్డగించి, కారంచల్లి, దుర్బషలడుతూ.. అదికారులపై దాడి చేసి దౌర్జన్యంగా ట్రాక్టర్ ను లాక్కెళ్లారు.
అటవీ నేరానికి పాల్పడిన వ్యాక్తులపై అటవీ చట్టాల ప్రకారO POR. No. 35/089 ప్రకారం కేసు నమోదు చేశారు. అలాగే అటవీ అధికారులపై దాడి చేసిన వ్యక్తులపై ధర్పల్లి పోలీస్ స్టేషన్ లో అటవీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు చేయగా, అటవీ అధికారులపై దాడి చేసిన వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి ట్రాక్టరును సీజ్ చేసి దర్పల్లి పోలిస్ స్టేషన్కు తరలించారు.
దాడులు జరుగుతున్న.. రక్షణ ఏది..
అటవీ భూములను కాపాడడానికి అటవీ శాఖ అధికారులు రెయింబవ ళ్ళు రాత్రనక పగలనక కష్టపడుతున్న ఎప్పుడు ఏ వైపు నుంచి వచ్చి దాడి చేస్తారో ననే ఆందోళన, భయం మాత్రం నెలకొని ఉంది. శనివారం రాత్రి కోటాలో పల్లి బీట్ పరిధిలో జరిగిన దాడి దీనికి ఒక నిదర్శనం. కొద్దిపాటి వర్షం పడిన అటవీ ప్రాంతానికి అనుకుని ఉన్న పంట పొలాలకు రాత్రికి రాత్రే గట్టు చప్పుడు కాకుండా ట్రాక్టర్లను పెట్టి చదవడం చేసి భూమిని కబ్జా చేసుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నట్లు పలు సంఘటనలు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఫారెస్ట్ అధికారులు దాదాపు పరిచోట్ల అటల్ ప్రాంతం చుట్టూరా కందకాలు తీసిన ఈ అక్రమార్కులు ఏదో ఒక రకంగా భూములను ఎగ్గొట్టే ప్రయత్నాలను చేస్తూనే ఉన్నారు.
రాత్రి సమయాల్లో అటవీ భూమిని చదును చేస్తున్నారనే సమాచారం వచ్చిన వెంటనే అధికారులు అక్కడికి వెళ్లి ట్రాక్టర్లను పట్టుకొని రావడం జరుగుతున్న అక్రమాలు మాత్రం ఆగడం లేదని, వీరికి చోట మూడు నాయకులు కూడా వంత పాడుతుండడంతో కబ్జాల పరంపర కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. గతంలో పరిశీలిస్తే ఘట్టమైన అడవులు నేడు ఏడారులుగా మారే పరిస్థితులు కంటికి కనబడుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టిన అటవీ అధికారులకు రక్షణ కల్పించడంలో మీణ వేషాలు లెక్కిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో ఆర్ఓఆర్ పట్టలు ఇచ్చిన దాన్ని సాకుగా చూపి దాన్ని చుట్టూరా ఇంకొంత భూమిని తమ వైపు చేసుకోవడానికి కొత్త కొత్త ఎత్తులు వేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది. ప్రభుత్వం అటవీ అధికారులకు రక్షణ కల్పించాలని పలువురు కోరుతున్నారు.