– కడలూరులో నిర్మించిన ఇండ్లను ప్రారంభించిన సీపీఐ(ఎం)పొలిట్ బ్యూరో సభ్యులు యు.వాసుకి
చెన్నై: సీపీఐ(ఎం) పోరాట ఫలితంగానే పేదలకు ఇండ్లు దక్కాయని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు యు. వాసుకి అన్నారు. కడలూరు జిల్లాలోని పరాంకిపెట్టైలో ఎస్సీలకు కేటాయించిన ఇండ్లను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్న గుడిసెల్లో నివసిస్తున్న గిరిజన కుటుంబాలకు గృహ సౌకర్యాలు కల్పించాలని కోరుతూ సీపీఐ(ఎం) కడలూరు జిల్లా కమిటీ నిరంతర పోరాటాలు నిర్వహించిందని తెలిపారు. ఈ పోరాట ఫలితంగానే వారి కల సాకారమైందని అన్నారు. ఈ ప్రాంతానికి ‘రెడ్ ఫ్లాగ్ నగర్’ అని పేరు పెట్టారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం)రాష్ట్ర సెక్రెటేరియట్ సభ్యులు ఎస్. కన్నన్ , ఇతర నాయకులు హాజరయ్యారు.
పోరాట ఫలితమే ‘రెడ్ ఫ్లాగ్ నగర్’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES