నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
యుద్ధ ప్రభావిత ప్రాంతాలైన ఇజ్రాయిల్, ఇరాన్ల నుంచి స్వదేశానికి తిరిగొస్తున్న తెలంగాణ విద్యార్థులను సురక్షితంగా ఇండ్లకు చేర్చాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. మధ్యప్రాచ్యంలో సంఘర్షణ తీవ్రమవుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత పౌరులందరికీ సహాయం చేయడానికి కట్టుబడి ఉందని చెప్పారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ, భారత రాయబార కార్యాలయాలు, సంబంధిత అధికారులతో నిరంతరం సమన్వయంతో ఉండి విద్యార్థులు వారి స్వస్థలాలకు చేరే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఇజ్రాయిల్, ఇరాన్ల నుంచి ఆదివారం ఢిల్లీకి చేరుకున్న ఆరుగురు విద్యార్థులు తమ సొంతూర్లకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఈ సందర్భంగా తెలంగాణ భవన్ అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి వరకు మరో ఏడుగురు విద్యార్థులు ఇజ్రాయిల్ నుంచి అమ్మాన్, జోర్డాన్ మీదుగా ప్రయాణించి భారతదేశానికి చేరుకుంటారని తెలిపారు. వారికి ఢిల్లీలో బస ఏర్పాటు చేసి, స్వస్థలాలకు పంపిస్తామని తెలిపారు.
తెలంగాణవాసులను సురక్షితంగా ఇండ్లకు చేర్చండి : సీఎం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES