నవతెలంగాణ – హైదరాబాద్ : సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణించడంతో, ఆయనను ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రి నుంచి గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. గత 24 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన ఢిల్లీ హైకోర్టు, ఆయన కోరుకున్న ఆసుపత్రికి తరలించాలని మంగళవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. వాంగ్చుక్కు నిరంతర వైద్య పర్యవేక్షణ అవసరమని ఎయిమ్స్, సఫ్దర్జంగ్ వైద్యులతో పాటు ఆయన వ్యక్తిగత వైద్యులు కూడా అభిప్రాయపడటంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఆయనకు మెరుగైన చికిత్స అందించేందుకు మేదాంత ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది.
సోనమ్ వాంగ్చుక్ కు తీవ్ర అస్వస్థత…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


