- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఆసియా క్రీడల్లో భారత్కు చెందిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ వరుణ్ సన్యాల్ అస్వస్థతకు గురయ్యాడు. క్రీడల్లో పాల్గొనడానికి సిద్ధమవుతుండగా.. అతడు క్రూయిజ్ షిప్లో స్పృహ తప్పి పడిపోయినట్లు ఎంఎంఏ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు నిఖిల్ కుందేరా వెల్లడించారు. వరుణ్ను నేపాల్కు చెందిన అథ్లెట్ గమనించి.. సమాచారం ఇవ్వడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉంది.
- Advertisement -



