Sunday, September 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసూర్యాపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. కారులో వ్యక్తి సజీవ దహనం

సూర్యాపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. కారులో వ్యక్తి సజీవ దహనం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌–ఖమ్మం జాతీయ రహదారిపై సూర్యాపేట సమీపంలోని పిల్లలమర్రి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం వైపు వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన కొద్ది నిమిషాల్లోనే కారు పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో కారులో ఉన్న వ్యక్తి సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడిని డా. కాసకుర్తి జగదీశ్‌గా గుర్తించారు. ఆయన ఖమ్మంలోని మమత ఆస్పత్రిలో న్యూరో సర్జన్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -