Tuesday, June 24, 2025
E-PAPER
Homeతాజా వార్తలునేడు రైతు భరోసా విజయోత్సవ సభ

నేడు రైతు భరోసా విజయోత్సవ సభ

- Advertisement -

– రైతులనుద్దేశించి మాట్లాడనున్న సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రైతు భరోసా విజయోత్సవ సభను మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్‌ గాంధీ విగ్రహ ఆవరణలో సాయంత్రం ఆరు గంటలకు నిర్వహిస్తున్నామనీ, రైతులనుద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతారని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌ జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతాపూర్వకంగా ప్రజా ప్రతినిధులు రైతులతో కలిసి వారి వారి నియోజకవర్గాల్లో, మండలాల్లో, గ్రామాల్లో పెద్దఎత్తున పాల్గొని ఈ రైతుపండగను విజయవంతం చేయాలని కోరారు. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయం ఎదుట నిర్వహించే సభకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీ లించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సభలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు పాల్గొం టారని తెలిపారు. తెలంగాణ రైతులను రాజులుగా చూడాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని నొక్కి చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం తొలకరికి ముందు గానే రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లోనే 67.01 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.8,284.66 కోట్లు జమ చేశామన్నారు. రేపటిలోగా మిగతా వారి ఖాతాల్లోనూ డబ్బులు పడతాయన్నారు. సాగులో ఉన్న ప్రతి ఎకరాకూ రైతు భరోసా చెల్లిస్తున్నామని తెలిపారు. ఇంత తక్కువ వ్యవధిలో పూర్తికావడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమమని చెప్పారు. అందుకే రైతుల సంతోషాలు పంచుకో వడం కోసం రైతు నేస్తం వేదిక ద్వారా మంగళవారం విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామన్నారు. యూపీఏ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలో దేశవ్యాప్తంగా రైతులకు రూ. 70 వేల కోట్ల రుణమాఫీ జరిగితే ..తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్‌ సర్కారు 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ కింద రూ. 21 వేల కోట్లు చెల్లించిందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సన్న వడ్లకు మద్దతు ధరపై రూ.500 బోనస్‌ ఇచ్చామనీ, దీని ద్వారా రైతులు అదనంగా రూ.2 వేల కోట్లు లబ్ది పొందారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం కొన్నా, కొనకపోయినా… మార్క్‌ఫెడ్‌ ద్వారా పండిన ప్రతి గింజనూ తమ ప్రభుత్వం సేకరిస్తోందన్నారు. రైతు భరోసా ద్వారా అందుకున్న నిధులను రైతులు పంట పెట్టుబడులకు వాడుకోవాలనీ, మంచి పంటలు పండించుకోవాలని ఆకాంక్షించారు రైతుల సంక్షేమం కోసం తమ ప్రభు త్వం లక్ష కోట్లకుపైగా ఖర్చు చేసిందనీ, ఇవేమీ పట్టని ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేయ డమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. మంచి ని గ్రహించి దురుద్దేశంతో చేసే విమర్శలు మానుకో వాలని హితవు పలికారు. సభాస్థలిలో విద్యుత్‌, తాగునీరు, షామియానాలు, సీటింగ్‌ కెపాసిటీ, ట్రాఫిక్‌ నియంత్రణ, వాహనాల పార్కింగ్‌ తదితర అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు, అధికా రులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్‌ రావు, ప్రిన్సిపల్‌ సెక్రెటరీ అహమ్మద్‌ నదీమ్‌, హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ సివి ఆనంద్‌, అడిషనల్‌ డీజీ (లా అండ్‌ ఆర్డర్స్‌) ఎంఎం భగవత్‌, ట్రాన్స్పోర్ట్‌ శాఖ కమిషనర్‌ సురేందర్‌ మోహన్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌ వి కర్ణన్‌, ఐఅండ్‌పీఆర్‌ కమిషనర్‌ సిహెచ్‌ ప్రియాంక, ఉద్యాన శాఖ కమిషనర్‌ యాస్మిన్‌ భాష, ఎస్పీడీసీఎల్‌ ఎమ్‌డీ ముష్రాఫ్‌ అలీ, వ్యవసాయ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

రైతుభరోసాకు రూ.513.83 కోట్లు విడుదల
రైతుభరోసా నిధులను మరో రూ.513.83 కోట్లు విడుదల చేసినట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 15 ఎకరాల్లోపు ఉన్న రైతుల ఖాతాల్లోకి రైతుభరోసా నిధులు జమ అయినట్టు చెప్పారు. మొత్తం 67.01 లక్షల మంది రైతుల ఖాతాలలోకి రూ.8,284.66 కోట్ల రైతు భరోసా నిధులు జమ అయినట్టు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -