– ఆల్ టైం కనిష్టానికి ఓలా ఎలక్ట్రిక్ షేర్లు
న్యూఢిల్లీ: భారత మార్కెట్లలో ఇజ్రాయిల్ – ఇరాన్ యుద్ధ భయాలు కొనసాగుతున్నాయి. ఈ ఉద్రిక్తతల్లో అమెరికా జోక్యం చేసుకోవడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. మరోవైపు చమురు ధరలు ఎగిసిపడుతోన్నాయి. ఈ పరిణామాలతో సోమవారం సెషన్లో బీఎస్ఈ సెన్సెక్స్ చివరికి 511 పాయింట్లు లేదా 0.62 శాతం పతనమై 81,896.79కి పరిమితమయ్యింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 140.50 పాయింట్లు లేదా 0.56 శాతం కోల్పోయి 24,971 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, ఎల్అండ్టి, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందుస్థాన్ యూనిలీవర్ అధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. ప్రముఖ విద్యుత్తు ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ షేర్లు ఆల్టైమ్ కనిష్ఠాన్ని తాకాయి. బ్లాక్డీల్ కారణంగా సోమవారం పెద్ద మొత్తంలో కంపెనీ షేర్లు చేతులు మారిన నేపథ్యంలో వాటి విలువ పతనమైంది. కంపెనీలో 0.8 శాతం వాటాకు సమానమైన 44 లక్షల షేర్లు రూ.44.1 వద్ద చేతులు మారాయి. దీంతో బీఎస్ఈలో షేర్ విలువ 6 శాతం మేర పతనమై రూ.43.20 వద్ద కనిష్ఠాన్ని తాకింది. గత 12 నెలల్లో షేరు విలువ 51 శాతం మేర పతనమయ్యింది.
మార్కెట్లను వీడని యుద్ధ భయాలు
- Advertisement -
- Advertisement -