Wednesday, June 25, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఅమెరికా దురాక్రమణ విధానాలను ఖండించాలి

అమెరికా దురాక్రమణ విధానాలను ఖండించాలి

- Advertisement -

– సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి

ప్రపంచంలోని దేశాలపై అమెరికా చేస్తున్న దురాక్ర మణ విధానాలను ప్రజలు ముక్తకంఠంతో ఖండించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. మంగళ వారం హైదరాబాద్‌ బాగ్‌ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగు తున్న సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా ముఖ్యకార్యకర్తల శిక్షణా తరగతులను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. ప్రపంచంలో సహజ వనరులున్న దేశాలపైన ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధిపత్యం చలాయిం చడానికి అమెరికా నిరంతరం దాడులకు పాల్పడుతోం దన్నారు. ఇందులో భాగంగానే ఇజ్రాయిల్‌కు అండగా నిలిచి.. ఇతర దేశాలపై దాడులకు ఊసిగొల్పిందని తెలిపారు. ఐక్య రాజ్యసమితి సహా అనేక అంతర్జాతీయ సంస్థలు ఇరాన్‌ అణ్వాయుధాలను తయారు చేస్తుందన డానికి ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేశాయన్నారు. అమెరికా, ఇజ్రాయిల్‌ యుద్ధ కాంక్ష వల్ల ఇరాన్‌ చమురు రవాణాకు కీలకమైన హర్మూజు జలసంధిని మూసి వేయడంతో ప్రపంచంలోని అనేక దేశాలకు తీవ్ర నష్టం కలుగుతోందన్నారు. యుద్ధాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రజల జీవనోపాధికి తీవ్ర విఘాతం ఏర్పడుతోందని, మన దేశంలోనూ నిరుద్యోగం, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగి ఆర్థిక సంక్షోభం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగంలో స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో వలసవాద, సామ్రాజ్యవాద విధానాలకు వ్యతిరేకంగా పోరాడే దేశాలకు అండగా ఉంటామని రాసుకున్నామన్నారు. నూతన ఆర్థిక విధానాల ఫలితంగా భారతదేశంపై కూడా యుద్ధ ప్రభావం ఉంటుందన్నారు. ప్రపంచంపై ఆధిపత్యాన్ని చెలాయించడానికి తన ఆయుధాల వ్యాపారాన్ని విస్తరించడానికి చేస్తున్న అమెరికా విధానాలను తిప్పికొట్టాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -