Wednesday, June 25, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఅభినందన్‌ వర్థమాన్‌ను బంధించిన పాక్‌ మేజర్‌ మృతి

అభినందన్‌ వర్థమాన్‌ను బంధించిన పాక్‌ మేజర్‌ మృతి

- Advertisement -

న‌వతెలంగాణ – హైద‌రాబాద్: భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ ను 2019లో పాకిస్థాన్‌ సైన్యం బంధించిన విషయం తెలిసిందే. అభినందన్‌ను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన పాకిస్థానీ మేజర్ మోయిజ్ అబ్బాస్ షా ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ ఉగ్రవాదులతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. అబ్బాస్ షా ప్రస్తుతం ఎలైట్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ లో పనిచేస్తున్నారు. ఇందులోభాగంగా ఆయన ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌ చేపడుతున్న సమయంలో ఉగ్రవాదులు ఎదురుకాల్పులు జరపడంతో ప్రాణాలు కోల్పోయినట్లు పాక్‌ సైన్యం వెల్లడించింది. ఈ దాడుల్లో 11 మంది ఉగ్రవాదులు సహా లాన్స్ నాయక్ జిబ్రానుల్లా అనే మరో సైనికుడు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -