నవతెలంగాణ హైదరాబాద్: మెక్సికోలోని గువానాజువాటోలో దారుణం చోటుచేసుకుంది. మతపరమైన సంబురాల్లో ఓ దుండగుడు తుపాకీతో కాల్పులకు తెగడబ్డాడు. దీంతో 12 మంది అక్కడికక్కడే మృతిచెందగా.. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. గువానాజువాటో రాష్ట్రంలోని ఇరాపువాటోలో సెయింట్ జాన్ ది బాప్టిస్ట్కు గౌరవంగా వీధి ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలు.. మ్యూజిక్ వింటూ, మద్యం సేవిస్తూ సంబురాలు చేసుకుంటున్నారు. ఇంతలో ఓ దుండగుడు తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులకు దిగాడు. దీంతో ఒక్కసారిగా బయపడి పరుగులు తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కాల్పుల్లో 12 మంది ఘటనా స్థలంలోనే మరణించారని అధికారులు వెల్లడించారు. మరో 20 మందికిపైగా గాయపడ్డారని తెలిపారు. దాడి వెనుక ఉద్దేశం, కాల్పులకు తెగబడిన దుండగుడి జాడ తెలియాల్సి ఉందన్నారు. ఈ దాడిని మెక్సికో అధ్యక్షురాలు క్లౌడియా షైన్బామ్ తీవ్రంగా ఖండించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.