– దేశాన్ని మత రాజ్యం వైపు నెట్టే అతిప్రమాదకర కుట్ర
– ఆ సంస్థ డిమాండ్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రాజ్యాంగంపై ఆర్ఎస్ఎస్ దాడికి పూనుకుందని ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ విమర్శించారు. రాజ్యాంగంలోని సెక్యులర్, సోషలిజం పదాలను తొల గించాలన్న ఆర్ఎస్ఎస్ డిమాండ్ను ఏఐఏడబ్ల్యూయూ తీవ్రంగా ఖండిస్తోం దని అన్నారు. శనివారం పశ్చిమ బెంగాల్లోని కోల్తాలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సెక్యులర్, సోషలిజం పదాలను తొలగించాలని ఆర్ఎస్ఎస్ చేసిన డిమాండ్ భారత రాజ్యాంగ ఆత్మను చిదిమేయడమేనని స్పష్టం చేశారు. దేశాన్ని మత, కులాధిపత్యం, కార్పొరేట్ రాజ్యం వైపు నెట్టే అతిప్రమాదకరమైన కుట్రలో భాగమే అని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ డిమాండ్ వెనుక ఉత్పత్తి వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, మహిళ వ్యతిరేక, మనువాద-కార్పొరేట్ ఎజెండా ఉందని విమ ర్శించారు. పేదల హక్కులను నాశనం చేయాలన్న ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి డిమాండ్లను ఆర్ఎస్ఎస్ లేవనెత్తుతుందని ధ్వజమెత్తారు. ఐక్యతతో రాజ్యాంగ పరిరక్షణ ఉద్య మాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగానికి కీలక మైన లక్ష్యాలను తొలగించాలన్న డిమాండ్కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని సూచించారు. శ్రమజీవుల హక్కులు, పౌర హక్కులు, స్వేచ్ఛ కోసం హిందూత్వ శక్తులు నుంచి దేశాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. అట్టడుగు వర్గాలు, గ్రామీణ పేదలు, వర్గాల పోరాటాలను అఖిల భారత ఉద్యమంగా విస్తరించాలని సూచించారు.
రాజ్యాంగంపై ఆర్ఎస్ఎస్ దాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES