- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో వెంకటేష్ అనే సింగరేణి ఉద్యోగి ప్రేమ పేరుతో వేధించడంతో మాధవి అనే యువతి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వెంకటేష్పై చర్యలు తీసుకోవాలని సోమవారం ఆసుపత్రి ముందు మాధవి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
- Advertisement -



