Monday, June 30, 2025
E-PAPER
Homeజిల్లాలుpashamylaram: పటాన్‌చెరులో భారీ పేలుడు.. 10కి చేరిన మృతుల సంఖ్య

pashamylaram: పటాన్‌చెరులో భారీ పేలుడు.. 10కి చేరిన మృతుల సంఖ్య

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ పేలుడు సంభవించింది. సిగాచీ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 26 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో తీవ్రంగా గాయపడిన 10 మంది మృతి చెందారు. ఘటనాస్థలంలోనే ఐదుగురు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు చనిపోయారు.

పేలుడు ధాటికి కార్మికులు సుమారు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. పేలుడు తీవ్రతకు ఉత్పత్తి విభాగం ఉన్న భవనం కూలిపోగా.. మరో భవనం బీటలు వారింది. పరిశ్రమ లోపల మరికొందరు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. కార్మికుల్లో పలువురు ఫోన్లు పనిచేయకపోవడంతో వారి కుటుంబసభ్యుల్లో ఆందోళన చెందుతున్నారు.

ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చందానగర్‌, మదీనాగూడలోని ప్రయివేటు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మదీనాగూడలోని ప్రణామ్‌ ఆస్పత్రిలో 18 మంది చికిత్స పొందుతున్నారని ఆస్పత్రి ఎండీ మనీష్‌గౌర్‌ తెలిపారు. వీరిలో ఇద్దరు మృతిచెందగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. మిగిలినవారి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. చందానగర్ లోని ప్రయివేటు ఆస్పత్రులో చికిత్స పొందుతున్న వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

11 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. ఘటనాస్థలాన్ని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్‌ పరిశీలించారు. సహాయక చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. పరిశ్రమ నుంచి ఘాటైన వాసనలు వెలువడుతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

ఘటనాస్థలాన్ని పరిశీలించిన మంత్రులు

సంఘటనా స్థలాన్ని మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్‌ వెంకటస్వామి పరిశీలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయాన్ని అందించాలని జిల్లా కలెక్టర్‌ను మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలన్నారు. మరోవైపు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు సంఘటనా స్థలిని పరిశీలించారు. కార్మికులను అడిగి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు.

గాయపడిన వారి వివరాలు..

నాగర్‌జిత్‌ తివారీ (ఒడిశా)

నగ్నజిత్ బారి (20) (ఒడిశా)

రామ్ సింగ్ (50) (ఒడిశా)

రాంరాజ్ (25) (బిహార్)

రాజశేఖర్ రెడ్డి (40) (ఆంధ్రప్రదేశ్)

సంజయ్ ముఖయా (25) (బిహార్)

ధన్‌బీర్‌ కుమార్ దాస్ (28) (బిహార్)

నీలాంబర్ (19) (ఒడిశా)

సంజయ్ కుమార్ యాదవ్ (28) (ఒడిశా)

గణేశ్‌ కుమార్ (26) (బిహార్)

దేవ్‌చంద్‌ (30) (బిహార్)

యశ్వంత్ (30) (విజయవాడ)

అభిషేక్ కుమార్ (బిహార్)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -