- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
కంటేశ్వర్ బైపాస్ సర్కిల్ వద్ద ఓ వ్యక్తికి బీపీ తక్కువ వచ్చి రోడ్డుపై పడడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ సంజీవ్ కాపాడారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ ప్రమాదం జరగగా వెంటనే అక్కడే ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ సంజీవ్ వెంటనే స్పందించి..అతనికి సపర్యలు చేసి అందుబాటులో గల ఆర్ఎంపి డాక్టర్ తో ప్రాథమిక వైద్యం చేయించి డాక్టర్ సూచనతో అంబులెన్సు పిలిపించి హాస్పిటల్ పంపి మనవత్వం చాటారు. సంజీవ్ ను స్థానికులు, విషయం తెలుసుకున్న ఏసీపీ మస్తాన్ అలీ, ట్రాఫిక్ పిఎస్ ఎస్ ఎచ్ వో ప్రసాద్ లు అభినందించారు.
- Advertisement -