నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్ చీప్ మోహన్ భగవత్ లపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ మరోసారి సెటైర్లు వేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 17తో మోహన్ భగవత్, మోడీల వయస్సు 75ఏళ్లు నిండుతాయని, దీంతో ఇరువురు ఆయా బాధ్యతల నుంచి తప్పుకొవాలని, కొత్త నాయకత్వానికి అవకాశమివ్వాలని శుక్రవారం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
“పేద అవార్డు గెలుచుకున్న ప్రధానమంత్రి.. గొప్ప స్వదేశానికి తిరిగి వస్తున్నారు – సెప్టెంబర్ 17, 2025న మోడీకి 75 ఏళ్లు నిండుతాయని ఆర్ఎస్ఎస్ చీఫ్ తిరిగి వచ్చినప్పుడు గుర్తు చేశారు” అని రమేష్ అన్నారు. కానీ ప్రధానమంత్రి కూడా తనకు సెప్టెంబర్ 11, 2025న 75 ఏళ్లు నిండుతాయని ఆర్ఎస్ఎస్ చీఫ్తో చెప్పగలరు, ఒక బాణం, రెండు లక్ష్యాలు అని ఆయన ఎద్దేవా చేశారు.
నాగ్పూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ 75 ఏళ్లు నిండడం అంటే ఆగి ఇతరులకు దారి ఇవ్వాలి అని వ్యాఖ్యానించినట్లు వార్తలను ఊటకాయిస్టు ఈ పోస్టు పెట్టారు.