నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు గుడ్న్యూస్. ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న 10వ తరగతి ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. విద్యాశాఖ ప్రకటించిన వివరాల ప్రకారం, ఏప్రిల్ 30న బుధవారం మధ్యాహ్నం 1 గంటకు పదో తరగతి ఫలితాలను విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాదులోని రవీంద్ర భారతిలో ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తయ్యింది. తాజా ఫలితాల ప్రకటనతో పాటు, ఈ సంవత్సరం మార్కుల మెమో రూపంలో కొన్ని కీలక మార్పులు చేపట్టారు. గతంలో విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా గ్రేడ్లు, సీజీపీఏలు మాత్రమే ఇచ్చే విధానానికి బదులుగా, ఈసారి రాత పరీక్షలు , ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కులను విడిగా చూపిస్తూ, మొత్తం మార్కులు , గ్రేడ్లను మెమోలో చేర్చనున్నారు. అలాగే, ఉత్తీర్ణత లేదా అప్రమత్తత (పాస్/ఫెయిల్) స్థితిని కూడా స్పష్టంగా పేర్కొననున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నేడు పదో తరగతి ఫలితాలు విడుదల
- Advertisement -