- Advertisement -
నవతెలంగాణ నిజామాబాద్: జిల్లాలోని శ్రీరాంసాగర్ జలాశయంలో నలుగురు యువకులు గల్లంతయ్యారు. ఎస్సారెస్పీలోకి ఈతకు వెళ్లి నీటమునిగారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే అక్కడే ఉన్న వారు గాలింపు చేపట్టగా ఓ యువకుడి మృతదేహాన్ని వెలికి తీశారు. అలాగే మరో ముగ్గురి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాతోంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ విషాద సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -



