- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికా–ఇరాన్ యుద్ధానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని మీడియాకు ఎవరు లీక్ చేస్తున్నారు? అమెరికా రక్షణ శాఖలో ఇప్పుడు ఇదే ప్రశ్న కలకలం రేపుతోంది. ఇరాన్తో యుద్ధంలో అమెరికా కీలక ఆయుధాల నిల్వలు తగ్గిపోతున్నాయంటూ వరుస కథనాలు వెలువడటంతో.. వాటి మూలాలను గుర్తించేందుకు అమెరికా రక్షణ మంత్రిత్వ కార్యాలయం పెంటగాన్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా యూఎస్ మిలటరీ జాయింట్ స్టాఫ్కు చెందిన సుమారు 50 మంది సైనిక, పౌర సిబ్బందికి లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించినట్లు ది న్యూయార్క్ టైమ్స్ను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
- Advertisement -



