నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
జిల్లాలోని ప్రధాన జలాశయాలైన మధ్య మానేరు, ఎగువ మానేరు ప్రాజెక్టులలో ఆదివారం ఉదయం 6 గంటల సమయానికి నమోదైన నీటిమట్టాలు, సామర్థ్యాలు ఇలా ఉన్నాయి.
మధ్య మానేరు జలాశయం
మధ్య మానేరు జలాశయం నీటిమట్టం +306.50 మీటర్లుగా నమోదైంది. దీని పూర్తి స్థాయి నీటిమట్టం 318 మీటర్లు. జలాశయం ప్రస్తుత సామర్థ్యం 6.822 టీఎంసీలు కాగా, పూర్తి సామర్థ్యం 27.55 టీఎంసీలు. గత ఏడాది ఇదే సమయానికి నీటిమట్టం +305.29 మీటర్లు, సామర్థ్యం 5.57 టీఎంసీలు. జలాశయంలోకి సగటు ఇన్ఫ్లోలు 110 క్యూసెక్కులుగా నమోదయ్యాయి. ఇందులో మానేరు, మూలవాగు, ఎఫ్ఎఫ్సీ ఇన్లెట్ల నుంచి నీరు చేరుతోంది. అవుట్ఫ్లోల ద్వారా సగటున 110 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది. ప్రస్తుతం స్పిల్వే గేట్లు, ఆర్/ఎస్ గేట్లు తెరవలేదు.
ఎగువ మానేరు ప్రాజెక్టు
ఎగువ మానేరు ప్రాజెక్టు డ్యాం స్థాయి 1469.25 అడుగులుగా నమోదైంది. దీని పూర్తి స్థాయి నీటిమట్టం 1482.50 అడుగులు. ప్రాజెక్టు సామర్థ్యం 0.63 టీఎంసీలు కాగా, పూర్తి సామర్థ్యం 2.00 టీఎంసీలు. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లోలు లేవు, అవుట్ఫ్లోలు కూడా లేవు. లోతు చెరువు నీటిమట్టం 10 అడుగులుగా ఉంది.
జలాశయాల్లో నీటిమట్టాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES