- Advertisement -
హైదరాబాద్ : ప్రపంచ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్ (డబ్ల్యూటీఐటీసీ) విదేశీ జాయింట్ సెక్రెటరీగా రామారావు దామా నియమితులయ్యారు. టెక్సాస్లోని టెక్ నిపుణుడు రామారావు 20 ఏండ్లకు పైగా ఓరాకిల్ ఈఆర్పీ టెక్నాలజీ అనుభవంతో వాణిజ్యం, ఫైనాన్షియల్స్, హెచ్ఆర్, బ్యాంకింగ్, ఆరోగ్య రంగాల్లో విస్తృత అనుభవం కలిగి ఉన్నారు. ”రామారావు అనుభవం, సామాజిక నిబద్ధత గ్లోబల్ తెలుగు కమ్యూనిటీకి వారధిగా నిలుస్తాయి.” డబ్ల్యూటీఐటీసీ చైర్మెన్ సందీప్ కుమార్ మక్తాలా పేర్కొన్నారు.
- Advertisement -