- Advertisement -
నవతెలగాణ – హైదరాబాద్: ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మెరుపు వరదలు సంభవించిన వేళ 28 మంది కేరళ పర్యాటకులు గల్లంతయ్యారు. వీరిలో 20 మంది మహారాష్ట్రలో స్థిరపడిన వారు కాగా.. మిగిలిన ఎనిమిది మంది కేరళలోని వివిధ జిల్లాలకు చెందినవారిగా అధికారులు గుర్తించారు. కాగా గల్లంతైన వారి మొబైల్ ఫాన్లు కూడా పనిచేయడం లేదని బంధువులు ఆందోళన చెందుతున్నారు. కాగా గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
- Advertisement -