- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
నీకు రక్ష నేను… నాకు రక్ష నువ్వు.. మనిద్దరం దేశానికి రక్ష అంటూ మండలం ఎడ్లపల్లి గ్రామంలోని మోడల్ స్కూల్లో ముందస్తుగా గురువారం రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. ఉపాధ్యాయురాళ్లు ఉపాధ్యాయులకు,విద్యార్థునిలు విద్యార్థులకు రాఖీ కట్టి మీరు మాకు రక్ష..మీకు మేము రక్ష.. మనం దేశానికి రక్ష అంటూ రాఖీలు కట్టి స్వీట్స్ పంచి రక్షాబంధన్ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్స్ పాల్ పూర్ణచందర్ రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -