నవతెలంగాణ – హైదరాబాద్: భారత్తో జరగనున్న అండర్-19 సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తమ జట్టును ప్రకటించింది. ఈ 15 మంది సభ్యుల బృందంలో ఇద్దరు భారత సంతతి యువ ఆటగాళ్లు ఆర్యన్ శర్మ, యశ్ దేశ్ముఖ్లకు చోటు దక్కడం విశేషం. విక్టోరియాకు చెందిన ఆర్యన్ శర్మ, న్యూ సౌత్ వేల్స్కు చెందిన యశ్ దేశ్ముఖ్లను సీఏ యూత్ సెలక్షన్ ప్యానెల్ ఎంపిక చేసింది.
ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా, భారత జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్లు, రెండు నాలుగు రోజుల మ్యాచ్లు జరగనున్నాయి. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 10 వరకు బ్రిస్బేన్, మాకే నగరాలు ఈ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 2026లో జింబాబ్వే, నమీబియా వేదికగా జరగనున్న ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాళ్లను సిద్ధం చేయడంలో భాగంగా ఈ సిరీస్ను నిర్వహిస్తున్నారు. ఆస్ట్రేలియా మాజీ హెడ్ కోచ్ టిమ్ నీల్సన్, అండర్-19 జట్టు కోచ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇదే మొదటి సిరీస్. ఆయన అనుభవం యువ జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోంది.
ఆస్ట్రేలియా అండర్-19 జట్టు:
సైమన్ బడ్జ్, అలెక్స్ టర్నర్, స్టీవ్ హోగన్, విల్ మలాజ్జుక్, యశ్ దేశ్ముఖ్, టామ్ హోగన్, ఆర్యన్ శర్మ, జాన్ జేమ్స్, హేడెన్ షిల్లర్, చార్లెస్ లాచ్మండ్, బెన్ గోర్డాన్, విల్ బైరోమ్, కేసీ బార్టన్, అలెక్స్ లీ యంగ్, జేడెన్ డ్రేపర్.