- Advertisement -
నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
అక్రమంగా ఆవులను తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. సబ్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ రెడ్డి సమాచారం మేరకు శనివారం చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం ఆందోల్ మైసమ్మ దేవాలయం వద్ద వాహనాల తనిఖీలో భాగంగా డీసీఎం TS11UD5600 గల వాహనాన్ని తనిఖీ చేయగా 19 ఎద్దులు 35 ఆవులు రాజమండ్రి సంతలో కొనుగోలు చేసి బౌదర్ పుర కలేభేరాలకు తలలిస్తున్నంగా పట్టుకున్నామని ఉపేందర్ రెడ్డి అన్నారు. వాహన డ్రైవర్ నేనావత్ భాస్కర్ గ్రామం మేడిగడ్డ తండ అమనగల్ నేనావత్ నరేందర్ సింగరేణి కాలనీ సైదాబాద్ గా గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సబ్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు.
- Advertisement -