- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
పీఆర్టీయూ మోపాల్ మండల నూతన అధ్యక్షులుగా కొట్టూరు దేవదాస్, ప్రధాన కార్యదర్శిగా ఎం. రాజశేఖర్, మహిళ ఉపాధ్యక్షురాలుగా నీరజ లు ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. గురువారం జరిగిన ఎన్నికల్లో పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగోనీ కిషన్, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్ గౌడ్ మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా నూతన అధ్యక్షులు కొట్టూరు దేవదాస్ మాట్లాడుతూ మోపాల్ మండల ఉపాధ్యాయుల సమస్యలపై తన వంతు పాత్ర పోషిస్తానని, అలాగే మండలంలో పీఆర్టీయూ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షునితో పాటు ఏకగ్రీవంగా ఎన్నికైన వారిని మోపాల్ మండల, జిల్లా ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
- Advertisement -