- Advertisement -
నవతెలంగాణ – రెంజల్
మండల కేంద్రమైన రెంజల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో శనివారం సాయంత్రం శాంతి కమిటీ సమా వేషన్ని బోధన్ ఏసిపి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోవు దుర్గామాత నవరాత్రులలో శాంతియుతంగా జరుపుకోవాలని, ఆయన సూచించారు. దుర్గామాత శోభాయాత్రను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఉత్సాహ కమిటీలను కోరారు. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు అధిక శబ్దం నిచ్చే డీజే లను వాడకూడదు అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బోధ రూరల్ సీఐ విజయబాబు, ఎస్సై కె. చంద్రమోహన్, ఎస్సై రాజు పోలీస్ సిబ్బంది ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -