- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు. అయితే గతంలో ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే ఛాన్స్ ఉండటంతోనే ఎమ్మెల్యే ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు చేసినట్లు చర్చ జరుగుతోంది.
- Advertisement -