- Advertisement -
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట్ మండలంలోని పోచారం ప్రాజెక్టు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్ఐ భార్గవ్ గౌడ్ ప్రాజెక్టు వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆదివారం ప్రాజెక్టు వద్దా బందోబస్తు నిర్వహించకపోవడంతో హెచ్చరిక బోర్డు దాటి పర్యాటకులు పోచారం ప్రాజెక్టు వద్దకు చేరుకొని సందడి చేశారు. ఈ విషయంపై ఎస్సైనీ వివరణ కోరగా.. శనివారం రోజు పలు కేసులలో సిబ్బంది బిజీ ఉండడంతో ఆదివారం బందోబస్తు నిర్వహించలేకపోయామన్నారు. ప్రాజెక్టు వద్ద పర్యాటకులు సందడి చేస్తున్న విషయం తమ దృష్టికి రాగానే సిబ్బందిని పంపి పర్యటకులను అక్కడి నుంచి పంపించి వేయడం జరిగిందన్నారు.
- Advertisement -