బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన కూడెల్లి బాలరాజ్ తండ్రి నర్సయ్య అనారోగ్యంతో మృతి చెందగా, బాధిత కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నదని సమాచారం అందించిన వెంటనే, నా రెడ్డి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు నా రెడ్డి మోహన్ రెడ్డి, కామారెడ్డి నియోజకవర్గ రామారెడ్డి మండల కాంగ్రెస్ ఇంచార్జ్ అధ్యక్షుడు మద్దికుంట నర్సాగౌడ్    స్పందించి, మోహన్ రెడ్డి బాధిత కుటుంబానికి 50 కేజీల బియ్యం, రూ.2000 ఆర్థిక సహాయాన్ని అందించగా,నర్సా గౌడ్ రూ.3000 ఆర్థిక సాయాయని అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, బాధిత కుటుంబం మోహన్ రెడ్డికి,నర్సాగౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్వామి గౌడ్,గంగారెడ్డి, మద్దికుంట దయానంద్, ఎల్లం, నిమిలే రాజు, తలారి నర్సింలు తదితరులు ఉన్నారు.
Spread the love