- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వర్ధంతి సందర్భంగా సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీలోని అధికారిక నివాసంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. రాధాకృష్ణన్ దేశానికి చేసిన సేవలను, ఆయన దేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా, గొప్ప తత్వవేత్త, విద్యావేత్తగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
- Advertisement -



