నవతెలంగాణ – జన్నారం
శ్రీ రాజరాజేశ్వర భజన మండలి నూతన కమిటీని ఎన్నుకున్నారు. జన్నారం మండలంలోని ఇందనపల్లి గ్రామంలో ఆ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పరచుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు దేశ్ ముఖ్ పాండే ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు దుర్శెట్టి వెంకటాచారి, కార్యదర్శి రమేష్ చారి ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కొత్తపెల్లి ఆంజనేయులు, ఉపాధ్యక్షులుగా మూల నారాయణ గౌడ్, జనరల్ సెక్రెటరీగా కండ్ల తిరుపతి, సలహాదారులుగా పాపాగౌడ్, గౌరవ అధ్యక్షులుగా జునుగురి లచ్చయ్య, దుప్పటి రామన్న లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం కళాకారులను గుర్తించి జీవన భృతి అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల భజన కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ రాజరాజేశ్వర భజన మండలి నూతన కమిటీ ఎన్నిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES