- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు : ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మండలంలోని అన్సాన్ పల్లి గ్రామానికి చెందిన జాటోత్ సారయ్య అనే రైతుకు చెందిన రూ.60 వేలు విలువగల దుక్కిటెద్దు మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. బాధిత రైతు పూర్తీ కథనం ప్రకారం.. శనివారం ఉదయం ఎద్దులను మేతకు విడిసిపెట్టినట్లుగా తెలిపారు. మేత మేస్తున్న ఎద్దు పొలాల్లో ఉన్న ట్రాన్స్ పార్మర్ సపోర్ట్ వైర్ విద్యుత్ షాక్ రావడంతో ఎద్దు అక్కడికక్కడే మృతి చెందినట్లుగా కన్నీరుమున్నీరైయ్యాడు. ప్రభుత్వం, సంబంధించిన ఉన్నతాధికారులు ఆర్థికంగా ఆదుకోవాలని వేడుకున్నాడు.
- Advertisement -