- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : భారత్తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో లంచ్ బ్రేక్ సమయానికి వెస్టిండీస్ 217/8 పరుగులు చేసింది. 301 పరుగులు వెనకబడి ఉంది. ఫాలోఆన్ నుంచి బయట పడేందుకు ఇంకా 102 పరుగులు చేయాల్సి ఉంది. ఫిలిప్ (19*), పియర్ (19*) క్రీజులో ఉన్నారు. అథనేజ్ 41, షై హోప్ 36, చందర్పాల్ 34 పరుగులు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4, జడేజా 3 వికెట్లు తీశారు. సిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ను భారత్ 518/5 పరుగులకు డిక్లేర్డ్ చేసిన విషయం తెలిసిందే.
- Advertisement -