- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కార్య నిర్వాహక ఇంజినీర్ మర్రి చక్రపాణి బుధవారం పదవీ విరమణ చేశారు.ఈ సందర్భముగా ఆయనకు అధికారులు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుపుతూ శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ చక్రపాణి ఉద్యోగంలో చేరి సుదీర్ఘకాలంగా శాఖలో సేవలందించినందుకు అభినందించారు.ఈ కార్యక్రమంలో డిఈఈ లు గణేష్, రఘుపతి, గంగబుషన్, ఏఈఈ లు రామారావు, విన్యాసు, కొండ వంశీ, మాణిక్యం, కొత్త రవి, డివిజన్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



