- Advertisement -
నవతెలంగాణ – చండూరు
ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా మండలంలోని బంగారిగడ్డ గ్రామంలో ప్లాస్టిక్ నిషేధానికి ఒక అడుగు ముందుకు వేశారు. మంగళవారం ఆ గ్రామ ఉపసర్పంచ్ ఎండి మహబూబ్ తండ్రి కాసిం జ్ఞాపకార్ధంగా 500 స్టీల్ ప్లేట్లు, గ్లాసులు గ్రామ సర్పంచ్ బోయపల్లి సునీత కు అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గ్రామస్థులు అందరూ ఇంట్లో జరిగే శుభాకార్యలకు ప్లాస్టిక్ ప్లేట్లు గ్లాసు లు వాడకుండా వీటిని సద్వినియోగం చేసుకొని గ్రామంలో ప్లాస్టిక్ నీషేదానికి తోడుపడాలని, ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అందరూ వార్డు సభ్యులు పంచాయతి కార్యదర్శి కోటి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



