- Advertisement -
నవతెలంగాణ కంఠేశ్వర్
క్యాబినెట్ హోదాలో ప్రభుత్వ సలహాదారులుగా నియమితులైన నిజామాబాద్ జిల్లాకు చెందిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ని తెలంగాణ సచివాలయంలో బాధ్యతలు స్వీకరణ కార్యక్రమంలో స్టేట్ అగ్రికల్చర్ ఫార్మర్ కమిటీ మెంబర్ గడుగు గంగాధర్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరాల రత్నాకర్ ల ఆధ్వర్యంలో అభయ హస్తం కాలోని ప్రధాన కార్యదర్శి మల్యాల గోవర్ధన్ లు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. క్యాబినెట్ హోదా కల్పించి జిల్లాకు సముచిత న్యాయం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లా అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు.
- Advertisement -



