Sunday, June 15, 2025
E-PAPER
Homeకరీంనగర్ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకే కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు

ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకే కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు

- Advertisement -

బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య 
నవతెలంగాణ – సిరిసిల్ల టౌన్
: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేక, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టికి మరల్చేందుకే కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు పంపుతుందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆరోపించారు. శనివారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అడ్డగోలు అమలు కానీ హామీలను ఇచ్చి మోసం చేసి గద్దెనెక్కిందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తున్నందుకు కేటీఆర్ కి నోటీసులు పంపుతూ డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ఇచ్చిన సవాల్ ని సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించి తన పవిత్రతను చాటుకోవాలి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వ్యవసాయ పనులు ప్రారంభానికి ముందే రైతుబంధు రైతుల ఖాతాలో జమ చేసేది అన్నారు. రైతు బీమా ప్రవేశపెట్టిన ఘనత కెసిఆర్ ది అని కొనియాడారు. నేడు వ్యవసాయ పనులు ప్రారంభమవుతున్న రైతులు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారన్నారు. రైతు భీమ పథకం కింద ఎల్ఐసిపి డబ్బులు చెల్లించకపోవడంతో బీమా పథకం ఆగిపోయిందన్నారు. రైతులు అమ్ముకున్న ధాన్యానికి పైసలు రాలేదని తెలిపారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం డబ్బులను రైతుల ఖాతాలో జమ చేసి, బోనస్ డబ్బులు చెల్లించాలన్నారు. అదేవిధంగా విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. యువతులకు స్కూటీలు, ల్యాప్ టాప్ ఎప్పుడు ఇస్తారో చెప్పాలన్నారు. పాఠ్యపుస్తకాలలో తెలంగాణ ఉద్యమ చరిత్రను ప్రభుత్వం తొలగించే చర్యలు చేపట్టడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక అసత్య ఆరోపణలు మానుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో న్యాలకొండ రాఘవరెడ్డి, కుంబాల మల్లారెడ్డి, బండ నరసయ్య, గుండారపు కృష్ణారెడ్డి ఎదురుగట్ల చంద్రయ్య గౌడ్, దిడ్డి రాజు, దార్ల సందీప్ రికమల్ల సంపత్, కొయ్యడ రమేష్ గౌడ్, జవహార్ రెడ్డి ఇమ్మనేని అమర్ రావు, గుండు ప్రేమ్ కుమార్, బూర తిరుపతి, వేల్ముల శ్రీనివాస్, జక్కుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -