- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామపంచాయతీ పరిధిలో గల సర్వే నెంబరు ఒకటిలో ఇంటి నిర్మాణానికి సంబంధించి అక్రమంగా నెంబర్లు కేటాయిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కొండమడుగు గ్రామానికి చెందిన కందుల శ్రీనివాస్ సోమవారం ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సమాచార హక్కు చట్టంలో వివరాలను అడిగితే తప్పుగా సమాచారం అందించారని ఆరోపించారు. ఈ విషయంపై తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
- Advertisement -