అనుమతి లేకుండా నిర్వహిస్తున్న శ్రీచైతన్య సీబీఎస్ఈ పాఠశాలను సీజ్ చేయాలి
కార్పొరేట్ విద్యాసంస్థలకు సహకరిస్తున్న జిల్లా విద్యాశాఖాధికారిపై చర్యలు తీసుకోవాలి
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్ : ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి పుస్తకాలు అమ్ముతూ పుస్తకాల పేరుతో అక్రమ వ్యాపారం చేస్తున్న శ్రీ చైతన్య విద్యాసంస్థల పై చర్యలు తీసుకోవాలని పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర అఖిల్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీచైతన్య పాఠశాల యాజమాన్యం అక్రమంగా పాఠశాల పక్కన ఒక ఇంట్లో అమ్ముతుంటే పిడిఎస్యు నాయకులు అక్కడికి వెళ్ళి అడ్డుకొని విద్యాశాఖ అధికారులకు సమాచారం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శ్రీచైతన్య యాజమాన్యం విద్యార్ధుల తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి పిఆర్వోలతో, వారి ఉద్యోగులతో అడ్మిషన్లు చేస్తూ, ఎక్కడ లేని విధంగా పుస్తకాలను అధిక ధరలకు విక్రయిస్తు దోపిడి చేస్తున్నారని అన్నారు.టెక్నో,ఐఐటి ఇలా వివిధ రకాల పేర్లతో చిన్న పిల్లల్ని నుండి టెన్త్ క్లాస్ విద్యార్ధుల వరకు పుస్తకాలు,నోట్ బుక్స్, టై,యూనిఫాం, షూ, బెల్ట్ నుండి అన్ని వస్తువులు పాఠశాలలోనే తీసుకోవాలని ఒత్తిడి చేస్తూ తల్లితండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. అదే విధంగా బీబీగూడెం పరిధిలో ఉన్న శ్రీ చైతన్య సీబీఎస్ఈ పాఠశాలకు అనుమతి లేకుండానే నిర్వహిస్తున్నారని అనేక సార్లు విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోకుండా ఆ పాఠశాలకు సహకరిస్తున్నారని అన్నారు. విద్యా వ్యాపారం, మరో వైపు పుస్తకాలతో వ్యాపారం చేస్తున్నా శ్రీ చైతన్య యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టి, ఈ విద్యాసంస్థలకు సహకరిస్తున్న జిల్లా విద్యాశాఖాధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేనియెడల పిడిఎస్యు ఆధ్వర్యంలో పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు నాయకులు బయ్యా గణేష్,రాజేష్,నవీన్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES