Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్గవర్నర్ చేతులమీదుగా అవార్డు అందుకున్న ఆదిలాబాద్ కలెక్టర్

గవర్నర్ చేతులమీదుగా అవార్డు అందుకున్న ఆదిలాబాద్ కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
నీతి అయోగ్ ప్రతిపాదిత ఆస్పిరేషన్ బ్లాక్ నార్నూర్ కు జాతీయస్థాయిలో స్వర్ణ పథకం లభించింది. శనివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ ను జిల్లా కలెక్టర్ రాజర్షి అందుకున్నారు. నీతి అయోగ్ ఎంపిక చేసిన 500 ఆస్పిరేషన్ బ్లాకులలో నార్నూర్  మొదటి స్థానంలో నిలిచి ఏకైక స్వర్ణ పథకాన్ని గెలిచింది. ఆరోగ్య, పోషణ, వ్యవసాయం, విద్య, మౌలిక సదుపాయాలు తదితర ఆరు సూచికలలో మెరుగైన పనితీరును ప్రదర్శించినందుకే ఈ పురస్కారం లభించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad