Saturday, September 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు

పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు

- Advertisement -

నవతెలంగాణ – బిచ్కుంద 
గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బిచ్కుంద మండలంలో గల వివిధ గ్రామాలలో దెబ్బతిన్న పంటలను వ్యవసాయ అధికారులు పరిశీలించారు. మండలంలోని గుండెనెమ్లి, మిషన్ కల్లాలి గ్రామాల్లో దెబ్బతిన్న వరి, సోయాబీన్, పత్తి, కంది పంటలను పరిశీలించి ముంపుకు గురైన పంటలను కాపాడుకునేందుకు మల్టీ కే మందు ఎకరానికి ఒక కిలో, సాఫ్ పౌడర్ ఎకరానికి ఐదు వందల గ్రాముల చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలని రైతులకు సూచించారు.

ప్రభుత్వం ఆదేశాల మేరకు పంట నష్టం జరిగిన గ్రామాల్లో వ్యవసాయ విస్తీర్ణ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం జరిగిన వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదికలు అందజేయడం జరుగుతుందని పంట నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందేలా వారి వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారులు సేకరిస్తారని  మొత్తం మండలంలో 33 శాతం పంటలు దెబ్బతిన్నాయని ఇందులో సోయా 2,685 ఎకరాలు, వరిపంట 566 ఎకరాలు, పత్తి 109 ఎకరాలు, 12 ఎకరాల్లో కంది పంట దిబ్బతిన్నాయని 1,742 రైతులకు చెందిన 3,372 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు మండల వ్యవసాయ అధికారి అమర్ ప్రసాద్ తెలిపారు. వ్యవసాయ విస్తీర్ణ అధికారులు లక్ష్మన్, ప్రియాంక  రైతులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -