Saturday, May 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు: బొల్లు యాదగిరి

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు: బొల్లు యాదగిరి

- Advertisement -

నవతెలంగాణ- వలిగొండ రూరల్
ఉపాధి హామీ చట్టరక్షణకై కూలీల సమస్యల సాధనకై డిమాండ్ చేస్తూ ఈ నెల 30న జరిగే కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి,జిల్లా సహాయ కార్యదర్శి సిర్పంగి స్వామి లు డిమాండ్ చేశారు. మంగళవారం రోజున మండల పరిధిలోని పులిగిల్ల, కేర్చిపల్లి గ్రామాల్లో ఉపాధి హామీ పని ప్రదేశంలో జరిగిన కూలీల సమావేశంలో వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పేదలు,వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్య పోరాటం తోపాటు, వామపక్షాల ఒత్తిడి మేరకు యూపీఏ ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి వందరోజుల పని గ్యారంటీ కోసం తీసుకొచ్చిన గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని సాధిస్తే నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం చట్టాన్ని సక్రమంగా అమలు చేయకుండా నిధులను క్రమక్రమంగా తగ్గిస్తూ, ఈ చట్టాన్ని ఎత్తివేయాలని కుట్ర చేస్తుందన్నారు.గత సంవత్సరం 2.50 లక్షల కోట్ల రూపాయలు కేటాయించాల్సి ఉండగా  90 వేల కోట్లు ఖర్చు చేసిన పాలకులు ఈ సంవత్సరం 86 వేల కోట్ల రూపాయలకు తగ్గించిందన్నారు.

దీంతో కూలీల జాబ్ కార్డులు, పని దినాలు పెద్ద ఎత్తున తగ్గించడం జరుగుతుందన్నారు. పథకం ప్రారంభంలో 2005 సంవత్సరంలో కూలీలందరికీ పనిముట్లు గడ్డపార, పార, తట్ట, గొడ్డలి, లాంటి పనిముట్లు ఇస్తామని చెప్పి కేవలం కొద్ది మంది కూలీలకు ఇచ్చి గత పది సంవత్సరాలుగా కూలీలకు పనిముట్లు ఇవ్వడం లేదని అన్నారు. పనిచేసే చోట టెంటు, మంచినీళ్ల సౌకర్యం ఏర్పాటు చేయడం లేదని, వారం వారం రావలసిన కూలీ డబ్బులు 5,6 వారాలుగా పెండింగ్ లోనే ఉంటున్నాయని దీంతో కూలీలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన 307 రూపాయలు ఎవరికి అందని పరిస్థితి ఏర్పడిందని కేవలం 150 నుండి 200 కు మించడం లేదని కొలతలను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పే స్లిప్పులు ఇవ్వకపోవడంతో కూలీలు తమకు ఎంత కూలి చెల్లిస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

ప్రభుత్వం వెంటనే ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం దిగి వచ్చే విధంగా ఈనెల 30 న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తున్నామని, ఈ ధర్నాలో కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని తమ డిమాండ్ల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశాల్లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు దొడ్డి బిక్షపతి, కెవిపిఎస్ మండల అధ్యక్షులు వేముల అమరేందర్,రైతు సంఘం మండల నాయకులు కొమ్మిడి సత్తిరెడ్డి,కూలీలు చిన్నం అంజమ్మ,అలివేలు, పద్మమ్మ,నరసింహ, అండాలు,యాదయ్య తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -